ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

సెల్వి
మంగళవారం, 17 డిశెంబరు 2024 (17:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో గణనీయమైన వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు (మంగళవారం) మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
బుధవారం నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదనంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
 
కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు పండించే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. రైతులు వరి కోతలను రెండు, మూడు రోజులు వాయిదా వేయాలని, నష్టపోకుండా ఉండేందుకు కోతకు వచ్చిన వరి పంటలను పొలాల్లో పేర్చుకోవాలని సూచించారు. 
 
గంటకు 35 నుండి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments