Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (12:15 IST)
సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే... బొబ్బిలికి చెందిన యువకుడు రాకేష్‌, కురుపాంకు చెందిన యువతి గాయత్రి ప్రేమించుకున్నారు.
 
ప్రేమించి, పెళ్లి చేసుకున్న తమను వేధించవద్దంటూ.. వాట్సప్‌ వీడియోలను విడుదల చేసి ప్రేమికులు అదృశ్యమయ్యారు. రెండు రోజుల నుంచి గాయత్రి, రాకేష్‌ కనిపించకుండాపోయారు. బుధవారం స్పిల్‌వేకు దగ్గరలో నాగావళి డ్యామ్‌కి 200 మీటర్ల దూరంలో గాయత్రి, రాకేష్‌ల మృతదేహాలు కనిపించాయి.
 
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మొబైల్‌లో ప్రేమికులు తీసిన సెల్ఫీ వీడియోను గుర్తించారు. వీడియోలో... ''కలిసి జీవించలేం, కనీసం కలిసి మరణిద్దాం అని, ప్రేమజంట చున్నీతో ఒకరినొకరు కట్టుకున్నారు. 
 
తాము ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ తమ ముఖంలో భయం లేదు అని చెప్పి తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు'' ఘటనా స్థలానికి ప్రేమికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను చూసి రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments