Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితతో ప్రేమ.. రైలు ముందు నిల్చుని ప్రేమికుల ఆత్మహత్య..

వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (12:00 IST)
వివాహితతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కానీ వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.
 
ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్కే జీనత్‌తో పరిచయం ఏర్పడింది. జీనత్‌కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో పెళ్లాడింది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు. అయినా వినయ్‌కు జీనత్‌ల మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వచ్చారు. అయితే శనివారం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు. ఇద్దరూ రైలు ముందు నిల్చుని ఆత్మహత్య చేసుకున్నారు. రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments