కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

సెల్వి
బుధవారం, 1 అక్టోబరు 2025 (19:49 IST)
ప్రేమజంట మృతి కాకినాడలో సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట మండలం, పనసపాడులో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో గల మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
యువకుడి మృతదేహాం హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా అన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుడు ఆశోక్ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ముందుగా అశోక్ ప్రియురాలు దీప్తి  గొంతుకోసి.. ఆ తర్వాత తాను రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీప్తి స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా... అశోక్ చెన్నైలో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments