Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన వ్యక్తిని ప్రేమించింది.. ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (10:19 IST)
పెళ్లైన వ్యక్తితో ప్రేమతో పడి.. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గన్నవరం పట్టణంలోని సినిమా హాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహ్మద్ జాస్మిన్ (20) బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది. 
 
ఈమెకు గన్నవరానికే చెందిన ఎస్కే జబీబుల్లా 27 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి పెళ్లి కావడంతో పాటు భార్యాఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే జాస్మిన్, జబీబుల్లాల పరిచయం ప్రేమగా మారింది.
 
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. అతడిని అనేక సార్లు హెచ్చరించారు. దీనికి తోడు రెండు రోజుల పాటు జబీబుల్లా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. 
 
వెంటనే జాస్మిన్ కుటుంబీకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జబీబుల్లాను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments