Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు అమ్మాయి.. గుంటూరు అబ్బాయి.. ఆత్మహత్య చేసుకున్నారు.. ఎందుకని?

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (10:32 IST)
తిరుపతిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన జె.శశి (24) బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇతడికి ఒంగోలుకు చెందిన కానిస్టేబుల్‌ బాబు కుమార్తె స్టెర్లా మేరీ (22)తో రెండేళ్ల కిందట పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దల దృష్టికి వెళ్లింది. స్టెర్లా మేరీతో వివాహానికి శశి తల్లిదండ్రులు అంగీకరించలేదు. 
 
దీంతో మనస్తాపానికి గురైన వీరు వారం రోజులుగా ఆందోళన చెందారు. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రెండు రోజుల కిందట తిరుపతికి చేరుకున్నారు. తమ వివాహానికి పెద్దలను ఒప్పించేందుకు శశి ఇక్కడ్నుంచీ ప్రయత్నించిందీ కూడా. దీనికి ఆ పోలీసు కానిస్టేబుల్ ససేమిరా అన్నట్టు సమాచారం. ఇక విడిపోయి జీవించడం కంటే... కలిసి చనిపోదామని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. 
 
అంతే తిరుపతి- పాకాల రైలు మార్గంలోని మహిళా పాలిటెక్నిక్‌ వద్దకెళ్లారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అటుగా వెళ్తున్న పాదచారుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శశి మృతదేహం పక్కన దొరికిన సెల్‌ఫోను ఆధారంగా మృతుల కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments