Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ జూమ్ మీటింగ్ - షాకిచ్చిన వైకాపా నేతలు

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (16:00 IST)
ఇటీవల ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా ఉంది. దీనిపై విపక్షాలు అనేక రకాలైన విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధానంగా అసమర్థ పాలన వల్లే ఈ తరహా ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం జూమ్ మూటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్‌లో వైకాపా నేతలు ఎంట్రీ ఇచ్చి నారా లోకేష్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
మాజీ మంత్రి కొడాలి నాని, వైకాపాలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీలతో పాటు వైకాపానేత దేవేందర్ రెడ్డిలు వచ్చాయి. వారు నారా లోకేష్‌కు పలు ప్రశ్నలు సంధించేందుకు ప్రయత్నించగా, తొలుత ఆడియో ఆ తర్వాత వీడియో కట్ అయింది. మీరు చేసేది కరక్టేనా, విద్యార్థులతో రాజకీయం చేస్తారా అని దేవేందర్ రెడ్డి నారా లోకేష్‌ను ప్రశ్నించగా, ఆ లోపే ఆడియో, వీడియో కట్ అయింది. ఆ వెంటనే లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
విద్యార్థులతో పవిత్ర కార్యక్రమం చేస్తుంటే జూమ్‌లోకి వచ్చి ఇలా మాట్లాడుతారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలు జూమ్ మీటింగ్‌లోకి వచ్చినట్టుగా చూపించే స్క్రీన్ షాట్‌లను నారా లోకేష్  రిలీజ్ చేశారు. కేవలం రాజకీయం చేయడానికే వైకాపా నేతలు తమ జూమ్ మీటింగ్‌లోకి వచ్చారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments