Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (09:50 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసిన సమయంలో నారా లోకేశ్ ఎక్కడ పాదయాత్రను ఆపివేశారో.. అక్కడ నుంచే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు. 
 
కక్షసాధింపులే ధ్యేయంగా జగన్ సర్కార్ రోజుకొకటిగా తెరపైకి తెస్తున్న తప్పుడు అంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
 
'నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు మేమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర కొనసాగింపునకు అన్ని అనుమతులు తీసుకున్నాం' అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments