Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు - పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాజీనామా!!

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (16:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు వెలుగుచూశాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీ సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. అలాగే, మరికొందరు కూడా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి పుట్టిపర్తి వైకాపా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పుట్టపర్తి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా తన అసంతృప్తి గళాన్ని వినిపించిన విషయం తెల్సిందే. శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇస్తే ఏమాత్రం పని చేయబోమని, సహకరించబోమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రవర్తన మూలంగా నాయకులు పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి టిక్కెట్‌ను వైకాపా నాయకత్వం మరోమారు శ్రీధర్ రెడ్డికే ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీని వీడినట్టు అర్థమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments