Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు - పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాజీనామా!!

వరుణ్
ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (16:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా వైకాపాలో లుకలుకలు వెలుగుచూశాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పార్టీ సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. అలాగే, మరికొందరు కూడా రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి పుట్టిపర్తి వైకాపా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పుట్టపర్తి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా తన అసంతృప్తి గళాన్ని వినిపించిన విషయం తెల్సిందే. శ్రీధర్ రెడ్డికి మరోమారు టిక్కెట్ ఇస్తే ఏమాత్రం పని చేయబోమని, సహకరించబోమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రవర్తన మూలంగా నాయకులు పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి టిక్కెట్‌ను వైకాపా నాయకత్వం మరోమారు శ్రీధర్ రెడ్డికే ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీని వీడినట్టు అర్థమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments