ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు... దిష్టితీసిన సతీమణి భువనేశ్వరి

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (09:14 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై మంగళవారం సాయంత్రం విడుదలైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత విజయవాడ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్.. దాదాపు 14.30 గంటల నిర్వరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అయితే, గత 53 రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీరసంగా ఉన్న ఆయన... మరోమారు సుధీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయారు. 
 
అలాగే, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకోగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నివాసానికి రైతులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకోవడం గమనార్హం. 
 
ఇంటికి వచ్చిన చంద్రబాబుకు ఆయన భార్య నారా భువనేశ్వరి దిష్టితీసిన టెంకాయను పగులగొట్టారు. అలాగే, ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments