Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలా?..చంద్రబాబు అగ్రహం

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (15:15 IST)
గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్‌ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్‌ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చెలామణి అవుతున్నారని అన్నారు.

ప్రజలంతా అవినీతిపరులని తానొక్కడే నీతివంతుడినని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుని ప్రజలకు శిక్షగా మారుస్తున్నారని. చిన్నాన్నని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎందుకని అగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments