Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు... పదో తేదీ నుంచి అమలు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (11:51 IST)
తిరుపతి - సికింద్రాబాద్ లింగంపల్లి ప్రాంతాల మధ్య తిరిగే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ రైలు లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్చిన వేళలు ఈ నెల పదో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు పదో తేదీ నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుందని సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. 
 
సాయంత్రం 5:50 గంటలకు బేగంపేట, 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. బీబీనగర్‌ 6:49 గంటలకు, 7:30 గంటలకు రామన్నపేట, 7:40కి చిట్యాల, 8 గంటలకు నల్గొండ చేరుకునే రైలు.. 9:47కు సత్తెనపల్లి, 11 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 
 
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. ఈ నెల పదో తేదీ నుంచే ఈ వేళలు అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు గుర్తించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments