Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అకౌంటెంట్‌ జనరల్‌ లేఖాస్త్రాలు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:10 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, అప్పులు, బడ్జెట్‌, ఆఫ్‌ బడ్జెట్‌ వ్యయంపై అకౌంటెంట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వరుసగా లేఖాస్త్రాలు సంధించడంతో రాష్ట్ర ఆర్థికశాఖ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఒక్క రోజునే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఏకంగా నాలుగు లేఖలు రాయడం వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేంద్రప్రభుత్వం తన రాజకీయ ప్రయోజ నాల కోసం ఇలా చేయిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్రధానంగా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌పై ఎజి కార్యాలయం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరదులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థికశాఖ ఇచ్చిన గ్యారంటీల వివరాలు చెప్పాలని ఎజి కార్యాలయం కోరింది. ఏ సంస్థ ఎంత రుణం తీసుకుంది, అందుకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ వివరాలు, ఆ రుణాన్ని ఇచ్చిన బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ వివరాలు, అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలు ఇవ్వాలని పేర్కొంది.

ఈ రుణాల ద్వారా సేకరించిన నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వంపై దాని ప్రభావం వంటి అంశాలపైనా ఆరా తీస్తోంది. అలాగే రాజధాని నిర్మాణంలో ప్రాధాన్యతాపరంగా కొన్ని పనులు చేపట్టేందుకు సిఆర్‌డిఎ తీసుకున్న మూడు వేల కోట్ల రుణంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ రుణాన్ని ఏ బ్యాంకుల నుంచి సేకరించారు, ఎలా ఖర్చు చేశారు, ఈ రుణా నికి సంబంధించి గ్యారంటీ ఒప్పందాల వివరాలు చెప్పాలని కోరినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments