Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరప విత్తన బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెడతాం: మంత్రి కురసాల కన్నబాబు

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:53 IST)
మిరప రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడిం చారు. అవసరం మేరకు ఆర్ బి కేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

కరోనా ఉదృతిని సాకుగా చూపి  కొంత మంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రాచుర్యం కలిగిన ప్రీమియం, హై బ్రీడ్ రకం విత్తనాలను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించే  వ్యాపారులు, డిలర్లపై కటిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

త్వరలో ఈ రకమైన ప్రాచుర్యం పొందిన విత్తనాలను ఆర్  బి  కె ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు  తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం అధిక ధరలకు అమ్ముతున్న కొన్ని రకాల  విత్తనాలా కోసం ఎదురు చూడకుండా అదే సెగ్మెంట్ లో అధిక దిగుబడిని ఇచ్చే ఇతర విత్తనాలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు  మంత్రి సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments