Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వరుస చిరుత పులి సంచారం.. భక్తులు పరుగులు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (13:33 IST)
తిరుమలలో వరుస చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఘాట్‌ రోడ్డులో ఓ చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో భయభ్రాంతులకు గురైన భక్తులు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. అటువైపుగా కారులో వెళ్తున్న కొందరు.. పులి పరుగులను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. అనంతరం టీటీడీ, అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు.
 
ఇక.. ఈ ఘటన మరుకవ ముందే.. తిరుమలలో మరోసారి భక్తుల కంటపడింది చిరుత. వేకువజామున సన్నిధానం అతిథి గృహం దగ్గర మరోసారి హల్‌చల్‌ చేసింది. ఓ పందుల గుంపును తరుముకుంటూ ముందుకెళ్లింది. దీనిని గమనించిన ఓ రెస్టారెంట్‌ సిబ్బంది.. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు, టీటీడీ సిబ్బందికి సమాచారమిచ్చారు.
 
చిరుత పులి సంచారంతో తిరుమల కొండపై భక్తులు, సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనిపై టీటీడీ, అటవీశాఖ దర్యాప్తు చేస్తోంది. భక్తులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments