Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైద్య సౌకర్యాల కోసం 27న వామపక్షాల ధర్నా

Webdunia
శనివారం, 25 జులై 2020 (10:04 IST)
ఏపీలో ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతూ ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేయాలని 10 వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.

ఈ మేరకు వామపక్షాల రాష్ట్ర నాయకులు పి మధు (సిపిఎం), కె రామకృష్ణ (సిపిఐ), వై సాంబశివరావు (సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), జాస్తి కిషోర్‌ బాబు (సిపిఐ ఎంఎల్‌), కాటం నాగభూషణం (ఎంసిపిఐ యు), బి బంగార్రావు (సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), బిఎస్‌ అమర్‌నాథ్‌ (ఎస్‌యుసిఐ సి), పివి సుందరరామరాజు (ఫార్వర్డ్‌ బ్లాక్‌), జానకిరాములు (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో రోజుకు 8వేల కేసులు పైబడి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వైద్య సౌకర్యాలు సరిగా అందక రోగులు నిస్సహాయులుగా ఉండిపోతున్నారని పేర్కొన్నారు. రోగులను ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

ఆసుపత్రుల్లోనూ, క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ రోగులకు సరైన ఆహారం అందడం లేదన్న వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments