Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల

అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 100

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:23 IST)
అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే లీకులా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
మంత్రి నారాయణ ఇదేదో చిన్న విషయమనీ, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సహేతుకంగా లేదన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలన్నారు. అమరావతి సచివాలయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాంబరులోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ఏకంగా మంత్రుల చాంబర్లకే చిల్లులు పడి నీళ్లు కారుతుంటే మంత్రిగారికి అది చిన్న విషయం అనిపిస్తుందనీ, అమరావతి సచివాలయంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments