Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్ పెట్టి ఆఫీస్ వర్క్ చేసిన మహిళ... ల్యాప్ టాప్ పేలిపోయింది..

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:09 IST)
కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ మహిళ వర్క్ చేస్తుండగా ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ పేలిన ఘటనలో ఓ మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది. కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
కడప జిల్లా బద్వేల్‌, మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలతకు ల్యాప్ టాప్ పేలిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ఛార్జింగ్ పెట్టి ల్యాప్‌టాప్‌లో ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటుండగా ఒక్కసారిగా ల్యాప్‌టాప్‌ నుంచి మంటలు చెలరేగాయి. పెద్ద బాంబులాగా అది పేలిపోయింది. ఆ ధాటికి సుమలత తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు బంధువులు.
 
చార్జింగ్‌ పెట్టుకొని మరీ పని చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. అయితే నాసిరకం చార్జర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. చార్జింగ్‌ పెట్టి పని చేయడం ప్రమాదకరమని వార్నింగ్‌ ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments