పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు : బీజేపీ నేత లంక దినకర్

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:48 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ దమ్మున్న నేత అని బీజేపీ నేత లంక దినకర్ అభిప్రాయపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్‌‍ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దినకర్ స్పందించారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. 
 
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో మాఫియా దురాగతాలకు అడ్డుకట్ట పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు.
 
పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం అందించారని, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం తీసుకువచ్చారని వివరించారు. కొవిడ్ సమయంలో పేదల ఆకలిని తీర్చడం కోసం రెట్టింపు బియ్యం అందిస్తే... కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు తరలిపోయిందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments