Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు : బీజేపీ నేత లంక దినకర్

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:48 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితంలోనూ దమ్మున్న నేత అని బీజేపీ నేత లంక దినకర్ అభిప్రాయపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోర్టులో తనిఖీలు, ఓ షిప్‌‍ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై దినకర్ స్పందించారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను అడ్డుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆ స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. 
 
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో మాఫియా దురాగతాలకు అడ్డుకట్ట పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. సిట్ వేయడంతో అక్రమార్కులు అప్రమత్తమయ్యారని వ్యాఖ్యానించారు.
 
పేదల కడుపు నింపాలన్న ఉద్దేశంతో నాడు ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం అందించారని, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కోసం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కార్యక్రమం తీసుకువచ్చారని వివరించారు. కొవిడ్ సమయంలో పేదల ఆకలిని తీర్చడం కోసం రెట్టింపు బియ్యం అందిస్తే... కాకినాడ పోర్టు నుంచి రెట్టింపు బియ్యం విదేశాలకు తరలిపోయిందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments