Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:27 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, సినీ నటి పూనంకౌర్‌లు సోషల్ మీడియాలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
 
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్నారని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ పనిలో మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక అపార్ట్‌‌మెంట్‌లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాయడానికి కారణం నిందితులను పట్టుకుంటే గానీ తెలియదని చెప్పారు. డబ్బు కోసం చేసారా లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి పని చేసారా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments