Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:27 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, సినీ నటి పూనంకౌర్‌లు సోషల్ మీడియాలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
 
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్నారని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ పనిలో మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక అపార్ట్‌‌మెంట్‌లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాయడానికి కారణం నిందితులను పట్టుకుంటే గానీ తెలియదని చెప్పారు. డబ్బు కోసం చేసారా లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి పని చేసారా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments