దేశ మంతటా విద్యార్థినులపై లైంగిక వేదింపు.. యాసిడ్ దాడులు జరుగుతుంటే... గుంటూరు జిల్లాలో గేర్ రివర్స్ అయింది. ప్రేమించి పెళ్లాడేందుకు నిరాకరించిన కళాశాల అధ్యాపకుడిపై విద్యార్థిని యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ వెంకటరమణ. ఇతనిపై శనివారం ఉదయం విద్యార్థిని సౌజన్య యాసిడ్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలకు పోరాడుతున్న వెంకటరమణను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. లెక్చరర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా తనను వివాహం చేసుకుంటానని వెంకటరమణ మోసం చేశాడని.. విద్యార్థిని సౌజన్య ఆరోపించింది. అందుకే యాసిడ్ దాడికి పాల్పడినట్లు ఆమె తెలుపుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.