Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు పెన్షన్‌ కోసం భర్త బతికుండగానే కాటికి పంపిన భార్య..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:24 IST)
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మరిచిపోతున్నారు. భార్యాభర్తల బంధం అంతకంటే దారుణంగా తయారైంది. తాజాగా ఓ భార్య కట్టుకున్న భర్త జీవించివుండగానే, చనిపోయినట్టు అధికారులను నమ్మించింది. అదీ వితంతు పెన్షన్ డబ్బుల కోసం ఈ ఘరానా మోసానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఓ మహిళ డబ్బులకు కక్కుర్తిపడి ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను కూలి పనుల కోసం ముంబైకు పంపించింది. దీంతో ఆయన కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులను నమ్మించి వింతంతు పెన్షన్ తీసుకుంటూ వస్తోంది. 
 
అయితే, భర్త ఉన్నట్టుండి గ్రామానికి రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన భార్య చేసిన నిర్వాహం తెలుసుకున్న ఆయన.. తాను బతికే ఉన్నట్టు అధికారులకు తెలిపాడు. దీంతో మహిళల వితంతు పెన్షన్‌ను నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments