Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతో ప్లస్ తైలం డబ్బాను మింగిన బాలుడు మృతి

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (13:10 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో కొత్త సవంత్సరం పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. మెంతో ప్లస్ తైలం డబ్బాను మింగిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివాహమైన 20 యేళ్ల తర్వాత కలిగిన ఒక్కగానొక్క సంతానం కావడం గమనార్హం. దీంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. 
 
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామానికి చెందిన నల్లన్న - సువర్ణ దంపతుల ఏకైక కుమారుడు ఆదివారం కొత్త సంవత్సర వేడుకల రోజున మెంతో ప్లస్ తైలం డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అది నోట్లోకి జారుకుంది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 20 యేళ్ల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments