Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతో ప్లస్ తైలం డబ్బాను మింగిన బాలుడు మృతి

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (13:10 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో కొత్త సవంత్సరం పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. మెంతో ప్లస్ తైలం డబ్బాను మింగిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివాహమైన 20 యేళ్ల తర్వాత కలిగిన ఒక్కగానొక్క సంతానం కావడం గమనార్హం. దీంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. 
 
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామానికి చెందిన నల్లన్న - సువర్ణ దంపతుల ఏకైక కుమారుడు ఆదివారం కొత్త సంవత్సర వేడుకల రోజున మెంతో ప్లస్ తైలం డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అది నోట్లోకి జారుకుంది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 20 యేళ్ల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments