Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి మోసం చేశాడనీ.. ప్రియుడిపై యాసిడ్‌తో దాడి...

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:51 IST)
ఇటీవలి కాలంలో ప్రేమించి మోసం చేసే ఘటనలు ఎక్కుగవా జరుగుతున్నాయి. దీంతో ప్రియురాళ్లు లేదా ప్రియులు ఆ మోసాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం, కొట్టాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొట్టాల గ్రామానికి చెందిన ఓ యువతీ యువకులు ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ.. ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. మోసం చేసిన నాగేంద్ర ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది. 
 
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్‌ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments