Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి మోసం చేశాడనీ.. ప్రియుడిపై యాసిడ్‌తో దాడి...

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:51 IST)
ఇటీవలి కాలంలో ప్రేమించి మోసం చేసే ఘటనలు ఎక్కుగవా జరుగుతున్నాయి. దీంతో ప్రియురాళ్లు లేదా ప్రియులు ఆ మోసాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం, కొట్టాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొట్టాల గ్రామానికి చెందిన ఓ యువతీ యువకులు ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ.. ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. మోసం చేసిన నాగేంద్ర ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది. 
 
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్‌ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments