కొత్త రాష్ట్రానికి కొత్త ఏడాదిలో తీపి కబురు అందనుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరిలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుబాటులోకి రానుందన్నారు.
త్వరలో ఏర్పాటు కానున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని చెప్పిన ఆయన సదరు సోలార్ ప్లాంట్ నుంచి జనవరిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందన్నారు.