Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు సమీపంలో క్షుద్రపూజలు

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:18 IST)
కర్నూలు సమీపంలోని మునగాలపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మునగాలపాడులో రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఇంటి ముందు పుర్రెలు, చీపురు, కుంకుమ కనిపించేసరికి ఆ మహిళ భయాందోళనకు గురయ్యారు. తనపై క్షద్రపూజలు చేశారేమోనని భయపడిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పసుపు, కుంకుమ చల్లి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు, చీపురుకట్ట పెట్టడంతో గ్రామంలో అనుమానాలు, భయాందోళనలను రేకెత్తాయి. సునీల్‌ అనే వ్యక్తి దగ్గర రాములమ్మ ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటూ కూలి పని చేసి జీవనం సాగిస్తోంది.

ఇంటి యజమాని సునీల్‌ మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఎవరితోనూ గొడవలు లేవని, అయినా తమ ఇంటి ముందు క్షుద్రపూజలు ఎందుకు చేశారో? ఎవరు చేశారో అంతుచిక్కడం లేదని, ఒకరకంగా భయం కలుగుతోందని అన్నారు. మరోవైపు రాములమ్మకు ఎవరైనా హాని తలపెట్టడానికి ఈ పని చేసి ఉంటారా? అన్న కోణంలో కూడా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments