Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ - కీర్తి హ్యాపీగా ఉండండి... అయినా ఇలా చేస్తున్నందుకు ఫీల్ అవ్వండి...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (10:25 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రేమ విఫలమైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను మనసుపడిన సహచర విద్యార్థి ఒకరు మరో యువతితో ప్రేమలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని తట్టుకోలేక పోయింది. దీంతో ఆమె సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని నూజివీడు పట్టణానికి చెందిన ఈదల గ్రామానికి చెందిన మందారాజు కుమార్తె శైలు (19) నూజివీడు బి-ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరోగ్యం సరిగాలేదని తరగతి గది నుంచి హాస్టల‌కు వచ్చేసింది. ఆ తర్వాత తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది.
 
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హాస్టల్‌కు వచ్చిన కొందరు విద్యార్థినులు శైలు ఉరేసుకున్న విషయాన్ని హాస్టల్ హార్డెన్‌కు చేరవేశారు. ఆ తర్వాత కళాశాల సిబ్బందితో కలిసి హుటా హుటిన నూజివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం జీఎంహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే శైలు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
 
అయితే, శైలు చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టింది. అందులో... 'శివ, కీర్తి హ్యాపీగా ఉండండి, మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నందుకు సారీ.. అయినా ఇలా చేస్తున్నందుకు బాగానే హ్యాపీగా ఫీల్‌ అవ్వండి' అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments