Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ - కీర్తి హ్యాపీగా ఉండండి... అయినా ఇలా చేస్తున్నందుకు ఫీల్ అవ్వండి...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (10:25 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రేమ విఫలమైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను మనసుపడిన సహచర విద్యార్థి ఒకరు మరో యువతితో ప్రేమలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని తట్టుకోలేక పోయింది. దీంతో ఆమె సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని నూజివీడు పట్టణానికి చెందిన ఈదల గ్రామానికి చెందిన మందారాజు కుమార్తె శైలు (19) నూజివీడు బి-ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరోగ్యం సరిగాలేదని తరగతి గది నుంచి హాస్టల‌కు వచ్చేసింది. ఆ తర్వాత తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది.
 
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హాస్టల్‌కు వచ్చిన కొందరు విద్యార్థినులు శైలు ఉరేసుకున్న విషయాన్ని హాస్టల్ హార్డెన్‌కు చేరవేశారు. ఆ తర్వాత కళాశాల సిబ్బందితో కలిసి హుటా హుటిన నూజివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం జీఎంహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే శైలు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
 
అయితే, శైలు చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టింది. అందులో... 'శివ, కీర్తి హ్యాపీగా ఉండండి, మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నందుకు సారీ.. అయినా ఇలా చేస్తున్నందుకు బాగానే హ్యాపీగా ఫీల్‌ అవ్వండి' అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments