Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు ఆర్ఎంవో మృతి.. వైరస్ నుంచి కోలుకున్న ఎమ్మెల్యే అంబటి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (11:49 IST)
కృష్ణా జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ యోగేంద్రబాబు (59) కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడలోని కొవిడ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆ.న... కోలుకుంటున్నట్టే కనిపించారు. కానీ, బుధవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. 'మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments