Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి ఇద్దరికి తీవ్రగాయాలు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (15:02 IST)
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వరి మగాణీ పొలంలో గడ్డిని తీసుకొని రావడానికి అంబారుపేట గ్రామానికి చెందిన డ్రైవరు ఇద్దరు  కూలీలతో కలిసి వెళ్లి వరి గడ్డిని ట్రాక్టర్ పై లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో పంట పొలాల్లో కిందకి వేలాడుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టరుతో సహా వరిగడ్డితో పాటు వరిగడ్డిపై కూర్చున్న ఇద్దరు కూలీలు, ఒక కూలీ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవరు మరో కూలికి తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
 
విద్యుత్ అధికారులు కేవలం అక్రమ సంపాదనకు అలవాటు పడి గ్రామాలలో కరెంటు వైర్లు కిందకి వేళ పడుతున్నాయని గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియపరిచిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోతున్నాకూడా మావి కావులే ప్రాణాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న కిందకి వేలాడుతున్నాయి విద్యుత్ తీగలను మరమ్మతులు చేసి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments