Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీప

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (16:54 IST)
మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీపంలోని కొత్త కాలనీకి చెందిన వెంకమ్మ మే 19వ తేదీన మద్యం తాగిన మత్తులో తూలుతూ గ్రామంలో కలియతిరిగింది. ఆ సమయంలో మరో మహిళ తనకు దేవత పూనిందంటూ ఊగిపోయింది.
 
వెంకమ్మకు దెయ్యం పట్టిందని తెలిపింది. దెయ్యాన్ని వదిలించాలంటే ఆమె చేతుల్లో నిప్పులు పొయ్యాలని ఆదేశించింది. అంతే.. ఆమె ఆదేశాలను ఇద్దరు యువకులు అమలు పరిచారు. ఆమె చేతులను బలంగా పట్టుకుని ఆ చేతుల్లో నిప్పులు ఉంచారు. దీంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆమె ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకోలేదు. రెండు చేతులు తీవ్రంగా కాలిన తరువాత విడిచిపెట్టారు.
 
నెల రోజులు ముగిసినా ఆమె చేతులకైన గాయాలు మానలేదు. దీనిని గమనించిన పలువురు పెద్దలు పంచాయతీ పెట్టారు. బాధిత మహిళకు చికిత్స చేయించాలని, ఘటనకు కారణమైన వారిని ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments