Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జుట్టు పట్టుకుని పైకితీసుకొచ్చి' పరిచయం చేయాలన్న కోరిక లేదు : కె.రోశయ్య

రాజకీయాల్లో తనకంటూ వారసులు ఎవరూ లేరనీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి కె.రోశయ్య అన్నారు. ఐదేళ్ళ గవర్నర్ పాలన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:13 IST)
రాజకీయాల్లో తనకంటూ వారసులు ఎవరూ లేరనీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి కె.రోశయ్య అన్నారు. ఐదేళ్ళ గవర్నర్ పాలన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. వారసులను తయారు చేయాలన్న ఆలోచన ఏనాడూ రాలేదని, అలా ఒక వారసుడిని జుట్టు పట్టుకుని పైకి తీసుకొచ్చి, 'నా వారసుడు' అంటూ పరిచయం చేయాలన్న కోరిక అస్సలు లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సాధించిన అన్నింటితోనూ ఆనందంగా ఉన్నానని, ఇకపై ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో విశ్రాంతి సమయంలో పుస్తకం రాయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. తానేమీ దేశం కోసం త్యాగం చేయలేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది జీవితాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, అలాంటి వారి గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి త్యాగాలతో పోల్చుకుంటే తానేమీ చేయలేదని రోశయ్య చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments