Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాశర్లపూడిలో కోనసీమ జలవిహారి బోటు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:55 IST)
తూర్పుగోదావరి జిల్లా వైనతేయ నదిలో అందాలను ఆస్వాదించడానికి పాశర్లపూడిలో రూ.1.20 కోట్లతో కోనసీమ జలవిహారి బోటును పర్యాటకుల కోసం ఏర్పాటుచేశారు. పాశర్లపూడిలో నిర్మించిన బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఈ కోనసీమ జలవిహారి బోటును ప్రారంభించారు.

30 మంది పర్యాటకులు కూర్చుని ప్రయాణించే విధంగా సీట్లు ఏర్పాటు చేసి, ఏసీతోపాటు ప్రయాణికుల రక్షణ కోసం వివిధ రకాల ఏర్పాట్లు చేశారు. బోటింగ్‌ పాయింట్‌ నుంచి ఆదుర్రు ఆది బౌద్ధ స్థూపం వరకు షికారు చేసేందుకు ఒక ప్యాకేజిను, అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయం వరకు మరో ప్యాకేజిను అందుబాటులోకి తెచ్చారు.

అంతేకాకుండా వైనతేయ నది పరిసర ప్రాంతాల్లో పదిహేను నిమిషాలు విహరించేలా మూడో ప్యాకేజిని ఏర్పాటు చేసినట్టు ఏపీ టూరిజం ఏఈ వై.సత్యనారాయణ తెలిపారు.

మొదటి ప్యాకేజిలో రెండు గంటల విహారానికి రూ.8,260, రెండో ప్యాకేజిలో మూడు గంటలకు రూ.10,620, మూడో ప్యాకేజిలో పదిహేను నిమిషాలకు గాను మనిషికి రూ.90 ధరగా నిర్థారించినట్టు తెలిపారు.

ఈ పాయింటు వద్ద స్పీడు బోట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్టు ఏఈ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments