Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రేషన్ డీలర్లు ఉండరు.. స్టాకిస్టులుగా ఉపాధి కల్పిస్తాం : మంత్రి కొడాలి

Webdunia
సోమవారం, 22 జులై 2019 (15:23 IST)
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే, రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామని తెలిపారు. సోమవారం అమరావతిలోని శాసనసభలో రేషన్ డీలర్ల తొలగింపు అంశంపై చర్చ జరిగింది. దీనికి మంత్రి కొడాలి నాని సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రేషన్ డీలర్లను తొలగించాలని ప్రతిపాదన లేదన్నారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామన్నారు. 
 
గతంలో నా నియోజకవర్గంలోనే 42 మంది డీలర్లను తొలగించి టీడీపీ అనుచరులను పెట్టారు. టీడీపీ నేతలు డీలర్లను నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించమని, దొంగదారుల్లో వచ్చిన వారు లేచిపోతారని చెప్పారు. గతం ప్రభుత్వం హయంలో రేషన్ డీలర్లపై కేసులు పెట్టారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప తొలగించరని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments