Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో మరిది రొమాన్స్... పిల్లలు అడ్డుగా ఉన్నారనీ...

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది.

Webdunia
బుధవారం, 26 జులై 2017 (08:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ఉన్న చిక్కుముడి వీడిపోయింది. ఈ చిన్నారుల తల్లితో ఆమె మరిది వివాహేతర సంబంధమే ఈ చిన్నారుల హత్యకు కారణమని తేలింది. వదినతో తాను అనుకున్నపుడు ఏకాంతంగా గడిపేందుకు చిన్నారుల వల్ల వీలుపడక పోవడంతో ఇద్దరు చిన్నారుల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి వారిద్దరినీ కాలువలో తోసేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకరపు చిన్నారావు, మంగ దంపతుల కుమారులైన ప్రశాంత్‌(10), విక్కీ(8) ఆదివారం ఉదయం పాలు తేవడానికి వెళ్లారు. అయితే, ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన వరసకు బాబాయ్‌ అయిన కైకరపు రవిశేఖర్‌ ఆదివారం ఉదయం మోటార్‌ సైకిల్‌ పై ఎక్కించుకుని పోలవరం వైపునకు తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించగా, అసలు విషయం తెలిసింది. 
 
చిన్నారుల తల్లి మంగతో తనకు వివాహేతర సంబంధం ఉందనీ, ఆమెతో తాను అనుకున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేందుకు చిన్నారులు అడ్డుగా ఉండటంతో వారిని అడ్డుతొలగించుకునే క్రమంలో నీటి కాలువలో తోసేసి హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments