Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళకు కడవరకు కలిసివుటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత మధ్యలోనే కడతేర్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గుంజా రాధాకృష్ణ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యను, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామానికి చెందిన సాంబలక్ష్మి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను నమ్మించి కడవరకు కలిసివుంటానని చెప్పి సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఇటీవల తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సాంబలక్ష్మిని బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న రాధాకృష్ణ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments