Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళకు కడవరకు కలిసివుటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత మధ్యలోనే కడతేర్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గుంజా రాధాకృష్ణ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యను, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామానికి చెందిన సాంబలక్ష్మి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను నమ్మించి కడవరకు కలిసివుంటానని చెప్పి సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఇటీవల తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సాంబలక్ష్మిని బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న రాధాకృష్ణ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments