Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి జరిపే స్థోమత లేదు.. మెరుగు పెట్టే రసాయనం తాగి ముగ్గురు ఆత్మహత్య

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (09:54 IST)
పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం.. పెళ్లి చేసేదెలా? అని కుంగిపోయింది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఈ ఘటన ఖమ్మంలో విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో ఓ కుటుంబంలో నివాసం ఉంటుంది.. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబంలో కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. జనవరి 11న వివాహం నిర్వహించాల్సి ఉంది. తండ్రి ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుండగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 
 
కట్నం లేకుండా వివాహానికి సిద్ధం అయ్యారు.. అక్కడి వరకు బాగానే ఉన్నా.. పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు పుట్టని పరిస్థితి నెలకొంది.. వివాహం దగ్గర పడటం, డబ్బులు లేకపోవడంతో కలతచెందారు. 
 
బుధవారం రాత్రి బంగారం మెరుగు పెట్టే రసాయనం తాగి.. తల్లి గోవిందమ్మ (49), కూతుళ్లు రాధిక(29), రమ్య(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి ఇంట్లో అంతా మృతిచెంది ఉండడంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments