Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం... ముక్కలుగా నరికి నదిలో పడేసిన భర్త!

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (08:33 IST)
కట్టుకున్న భార్య తనను మోసం చేసి పరాయి వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇది మరింతగా పెరిగిపోవడంతో భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూటలు గట్టి నదిలోపడేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశవళ్లి గ్రామానికి చెందినకి ఆశా (28), రంగప్ప అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం రంగప్పలో బాగా నాటుకునిపోయింది. 
 
దీంతో నాలుగు నెలల క్రితం బావ చంద్రతో కట్టుకున్న భార్య రంగప్ప నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. 
 
అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. 
 
గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చేసిన తప్పును అంగీకరించారు. దీంతో రంగప్ప, చంద్రలను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments