Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డితో ముద్రగడ కటిఫ్‌ - బాబుతో దోస్తీ...

కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:33 IST)
కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎపిలో ఒకానొక దశలో ముద్రగడ ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించారని టిడిపి నేతలే స్వయంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌తో స్నేహాన్ని కటిఫ్ చేసుకుని చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. 
 
అదెలాగంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు వారిని బిసిల్లో చేర్చడంపై కాపులందరూ తెలుగుదేశం పార్టీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో తను ఇప్పుడు జగన్ వెంట ఉంటే ఖచ్చితంగా కాపులందరూ తనను వ్యతిరేకించే అవకాశం ఉందని భావించిన ముద్రగడ ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే దోస్తీకి సిద్థమైపోయాడు. కాపులను బిసిల్లో చేర్చిన చంద్రబాబుకే తమ మద్ధతంటూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కాపుల విషయంలో ముందడుగు వేశారంటూ మెల్లమెల్లగా ముందుకు వెళుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments