Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటు వల్లే కన్నా లక్ష్మీనారాయణ కోడలు చనిపోయారు: వైద్యులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు గురువారం అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై రకరకాలైన ఊహాగానాలు, పుకార్లు వచ్చాయి. అయితే, వైద్యులు మాత్రం ఈ మరణానికి గల కారణాలను వివరించారు. ఆమె కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయారని తేల్చారు. 
 
కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక గురువారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తన మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన పార్టీలో ఆమె బంధువులు... స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ పార్టీలో ఆమె గంటకు పైగా నృత్యం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఆ వెంటనే ఆమెను రాయదుర్గ్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపు ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంచి, పోస్టుమార్టం చేశారు. ఇందులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడికావడంతో ఆమె మృతిపై ఉన్న పుకార్లకు చెక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments