Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటు వల్లే కన్నా లక్ష్మీనారాయణ కోడలు చనిపోయారు: వైద్యులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు గురువారం అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై రకరకాలైన ఊహాగానాలు, పుకార్లు వచ్చాయి. అయితే, వైద్యులు మాత్రం ఈ మరణానికి గల కారణాలను వివరించారు. ఆమె కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయారని తేల్చారు. 
 
కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక గురువారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తన మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన పార్టీలో ఆమె బంధువులు... స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ పార్టీలో ఆమె గంటకు పైగా నృత్యం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఆ వెంటనే ఆమెను రాయదుర్గ్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపు ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంచి, పోస్టుమార్టం చేశారు. ఇందులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడికావడంతో ఆమె మృతిపై ఉన్న పుకార్లకు చెక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments