Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్‌సైట్‌లో ఉద్యోగుల పంపకాలపై కమల్‌నాథన్ కమిటీ గైడ్‌లైన్స్!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన భేటీలో ఉద్యోగుల పంపిణీపై దాదాపు 2 గంటల పాటు కమిటీ మంతనాలు జరిపింది. ఈ అంశంపై రెండు రోజులు కేంద్రం ప్రభుత్వం ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 
కాగా, ఈ కమిటీ ఖరారు చేసిన గైడ్‌లైన్స్‌లో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని, ఆర్టికల్ 371డి ప్రకారం ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే అక్కడే స్థానికత వర్తిస్తుందని కమిటీ వెల్లడించింది. 
 
ఒంటరి మహిళ, భార్యభర్తలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని, రెండేళ్ళలో రిటైరయ్యేవారికి ఆప్షన్లు లేవని కమల్‌నాథన్ కమిటీ పేర్కొంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 10 రోజుల్లోగా వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా పాల్గొన్నారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments