Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణదుర్గం పీఎస్‌లో బాబు - లోకేశ్‌లపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:09 IST)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషనులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఇటీవల మంత్రిపదవి వరించింది. ఏపీ సీఎం జగన్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు లక్కీ ఛాన్స్ వరించింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కళ్యాణదుర్గంకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌ను మళ్లించారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్లే ఆస్పత్రికి తీసుకెళుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాతపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు తమతమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీరిద్దరూ అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments