Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణదుర్గం పీఎస్‌లో బాబు - లోకేశ్‌లపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:09 IST)
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషనులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేశారు. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఇటీవల మంత్రిపదవి వరించింది. ఏపీ సీఎం జగన్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు లక్కీ ఛాన్స్ వరించింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కళ్యాణదుర్గంకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమెకు నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌‌ను మళ్లించారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే, మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం వల్లే ఆస్పత్రికి తీసుకెళుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకుని మృత్యువాతపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చంద్రబాబు, లోకేశ్‌లు తమతమ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వీరిద్దరూ అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments