Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందరు 'భీమ్లా నాయక్‌'లు వచ్చినా నన్నేమీ చేయలేరు.. ద్వారంపూడి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (13:54 IST)
పద్ధతి మార్చుకోకపోతే కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కు "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఇస్తానంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనికి ద్వారంపూడి మంగళవారం కౌంటర్ ఇచ్చారు. కాకినాడలో తననేమీ చేయలేరన్నారు. ఎంతమంది భీమ్లా నాయక్‌లు వచ్చినా తననేమీ చేయలేరని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సినిమాలు, రాజకీయాలు అనేవి వేర్వేరని పవన్ గుర్తించాలని హితవు పలికారు. పైగా, సంవత్సరానికొకటి ఇలాంటి సభలు పెట్టడం ద్వారా వచ్చే పబ్లిసిటీతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటేనని చెప్పారు. 
 
ఆయన అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకే అపారమైన నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. 
 
పవన్ కళ్యాణ్ తన జోలికి వస్తే ఏమాత్రం క్షమించే ప్రసక్తే లేదన్నారు. తాము పవన్ వంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఇంటిపైకి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, పైగా, తమను కాకినాడలో ఏమీ చేయలేరని ఆయన అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments