Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందరు 'భీమ్లా నాయక్‌'లు వచ్చినా నన్నేమీ చేయలేరు.. ద్వారంపూడి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (13:54 IST)
పద్ధతి మార్చుకోకపోతే కాకినాడ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కు "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఇస్తానంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దీనికి ద్వారంపూడి మంగళవారం కౌంటర్ ఇచ్చారు. కాకినాడలో తననేమీ చేయలేరన్నారు. ఎంతమంది భీమ్లా నాయక్‌లు వచ్చినా తననేమీ చేయలేరని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సినిమాలు, రాజకీయాలు అనేవి వేర్వేరని పవన్ గుర్తించాలని హితవు పలికారు. పైగా, సంవత్సరానికొకటి ఇలాంటి సభలు పెట్టడం ద్వారా వచ్చే పబ్లిసిటీతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటేనని చెప్పారు. 
 
ఆయన అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకే అపారమైన నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. 
 
పవన్ కళ్యాణ్ తన జోలికి వస్తే ఏమాత్రం క్షమించే ప్రసక్తే లేదన్నారు. తాము పవన్ వంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ ఇంటిపైకి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని, పైగా, తమను కాకినాడలో ఏమీ చేయలేరని ఆయన అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments