Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వంపై విమర్శలు : నోటీసులు జారీచేస్తున్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ.. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కోణంలోనే ప్రభుత్వం యంత్రాంగం ఉంది. ఇందులోభాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలను ఒక్కొక్కరిగా గుర్తించి పోలీసులు నోటీసులు జారీచేస్తున్నారు. 
 
తాజాగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడ్డాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.21 వేల కోట్లు. ఈ వ్యవహారానికి లింకులు ఏపీలోని విజయవాడ నగరంలో ఉన్నట్టు బయటపడడంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 
 
ఇందులోభాగంగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచీ ఆరోపిస్తోంది.
 
ఈ క్రమంలో ధూళిపాళ్ల కూడా ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీంతో కాకినాడ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో కోరారు. 
 
విచారణకు హాజరై ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల  నివాసానికి గురువారం వచ్చిన కాకినాడ పోలీసులు నోటీసులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments