Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లికి ఉరేసింది.. ఆపై ఉరేసుకుంది.. అమ్మ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా..?

సెల్వి
బుధవారం, 30 అక్టోబరు 2024 (19:19 IST)
కాకినాడ జిల్లాలో తల్లికి ఉరేసి.. ఆపై కుమార్తె కూడా ఉరేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాకినాడ వ‌న్‌టౌన్ సీఐ నాగ‌దుర్గారావు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా పి.గ‌న్న‌వ‌రం మండ‌లం వై.కొత్త‌ప‌ల్లికి చెందిన ఆకాశం స‌ర‌స్వ‌తి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ప‌న్నెండేళ్లుగా కాకినాడ పెంకెవారి వీధిలోని ఓ భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో అద్దెకు ఉంటున్నారు. స‌రస్వ‌తి భ‌ర్త న‌ర్సింహారావు ప‌ద‌హారేళ్ల క్రితం అనారోగ్యంతో చ‌నిపోయారు. 
 
భ‌ర్త చ‌నిపోవ‌డంతో స‌ర‌స్వ‌తి త‌న పిల్ల‌ల‌ను తీసుకొని జీవ‌నోపాధి కోసం కాకినాడ‌కు వ‌చ్చేశారు. పెద్ద కుమార్తె బుజ్జికి వివాహం కాగా విశాఖ‌ప‌ట్నంలో ఉంటున్నారు. 
 
చిన్న కుమార్తె స్వాతి ఇంట్లోనే టైల‌రింగ్ చేస్తుండేది. సరస్వ‌తి కొన్నాళ్లుగా అనారోగ్యం, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దాంతో స్వాతి ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో లాభం లేదనుకున్న స్వాతి తల్లికి ఉరేసి.. ఆపై తాను కూడా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
త‌ల్లి కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండి పోయిన కుమార్తె ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంపై అంద‌రూ షాకవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments