Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీని అనంతపురంలో పెట్టాలి : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (15:32 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్టుకు జైకొట్టిన వైకాపాకు చెందిన కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి.. మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయవచ్చన్నారు. ఇక్కడ అసెంబ్లీని పెట్టి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, రాజధాని మార్పు అంశంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. అమరావతిలో 4,500 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాజధాని మార్పుపై హైపవర్ కమిటీ నివేదికదే తుది నిర్ణయం అన్నారు. గత పొరపాట్లు పునరావృతంకాకుండా నిర్ణయాలుంటాయని చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో అమరావతి పేరిట జరిగిన అక్రమాలు బటయకు వస్తాయని మంత్రి మోపిదేవి చెప్పారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు వెళ్లాయన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని మంత్రి మోపిదేవి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments