Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్చీ కోసం రచ్చ చేసిన మాధవీ రెడ్డి.. ఈ కన్ను గీటడం ఏంటంటున్న వైకాపా.. నిజమెంత? (video)

సెల్వి
శుక్రవారం, 8 నవంబరు 2024 (16:11 IST)
Madhavi Reddy
కడప కార్పొరేషన్​లో ఒక మహిళ ఎమ్మెల్యేగా తనకు కుర్చీ లేకుండా అవమానించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మాధవీ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎక్కడ కూర్చునైనా పోరాటం చేస్తానని, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం అవమానించినంత మాత్రాన భయపడిపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మాధవీ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. సమావేశం గందరగోళంగా మారడంతో వాయిదా వేసి మేయర్ బయటకు వచ్చారు. 
ఈ సందర్భంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ.. "సమావేశంలో మహిళను అవమానపరుస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిలబడి మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం." అన్నారు. 
 
అయితే మాధవీరెడ్డిపై వైకాపా వేరేవిధంగా నిప్పులు చెరుగుతోంది. కడప కార్పొరేషన్‌ పాలకవర్గ సమావేశంలో.. మేయర్‌ సురేష్ గారితో సమానంగా కుర్చీ కావాలంటూ కావాలనే మాధవిరెడ్డి రచ్చ చేశారని అంటోంది వైకాపా. 
 
 
ఇంకా కుర్చీ కోసం కమిషనర్‌ వైపు చూస్తూ గొడవ కొనసాగాలంటూ కన్నుగీటిన వీడియోను వైకాపా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పక్కా స్కెచ్‌తో రచ్చ చేసిందనడానికి ఈ కన్ను గీటడం కంటే నిదర్శనం ఏం కావాలి? అంటూ వైకాపా ప్రశ్నించింది. గతంలో పలు సందర్భాల్లో ఆమె కన్ను గీటిన వీడియోలను షేర్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments