Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి.. తలను ముక్కలు చేసి.. టిఫిన్ బాక్సులో పెట్టి...

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (15:54 IST)
రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకట రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈయనను హత్య చేసి, తలను శరీరం నుంచి వేరు చేసి, దాన్ని కూడా ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి లోయలో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య తలను గువ్వల చెరువు ఘాట్ వద్ద ఓ టిఫిన్ బాక్సులో పోలీసులు గుర్తించారు. 
 
ఆ తలను ముక్కలు చేసి టిఫిన్ బాక్సులో పెట్టి ముసలయ్య లోయలో పడేసినట్లు తేల్చారు. అనంతరం ఆయన ఇంట్లో వెంకట రమణయ్య మొండాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 
 
ప్రాథమిక విచారణలో భాగంగా, మునిసిపల్ మాజీ ఛైర్మన్ ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments