Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధిపతిగా తొలి తెలుగు వ్యక్తి

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (08:20 IST)
కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధిపతిగా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్ మూర్తిని కేంద్రం ఎంపిక చేసింది. కాగ్ చీఫ్‌గా ఒక తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగ్ చీఫ్‌గా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారని కేంద్రం వెల్లడించింది. 
 
ఈయన సంజయ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు కావడం గమనార్హం. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.
 
24 డిసెంబర్ 1964లో జన్మించిన సంజయ్ మూర్తి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 2021 నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
నిజానికి ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుంచి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్‌ చీఫ్‌గా నియమించడం గమనార్హం. గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గిరీశ్‌చంద్ర ముర్ము పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments