Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంఖ్యాబలం లేక రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. జానారెడ్డి

Webdunia
ఆదివారం, 29 మే 2016 (12:18 IST)
సంఖ్యాబలం లేక రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు ఆ పార్టీ టీ కాంగ్రెస్ సీనియర్ నేత కె. జానారెడ్డి తెలిపారు. రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 11న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గత నాలుగైదు రోజులుగా కసరత్తులు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలని తాజాగా నిర్ణయించింది.
 
ఇదే అంశంపై కె జానారెడ్డి మాట్లాడుతూ... రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే బలం లేకపోవడంతో అనవసరంగా పోటీ చేసి అభాసు పాలవడం, పార్టీ ప్రతిష్ట దిగజార్చడం కన్నా పోటీ చేయకుండా ఉండటమే ఉత్తమమని తెలిపారు. విజయానికి తగిన సంఖ్యా బలం లేనప్పుడు ఎన్నికల బరిలో దిగి రాజకీయాలను కలుషితం చేయకూడదని తమ పార్టీ భావిస్తున్నామన్నారు. 
 
పాలేరు ఉప ఎన్నిక ఫలితం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి ఆంశాలపై సీఎల్పీలో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత టీ జీవన్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి, ఆకుల లలిత, పీ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments