Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (09:55 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆర్ఆర్ఆర్ నటులు జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ శుక్రవారం కలువనున్నారు. ఈ సందర్భంగా వారిద్ద‌రూ విజ‌య‌వాడ వరద బాధితులకు ప్ర‌క‌టించిన విరాళాల తాలూకు చెక్‌ల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేయ‌నున్నారు. 
 
ఇక సీఎం చంద్రబాబు పిలుపుమేరకు వరద సాయం కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తార‌క్‌, రామ్ చరణ్‌లు విరాళాలు ప్ర‌క‌టించిన నేపథ్యంలో వీరిద్దరూ ఏపీకి చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళం అందిస్తామ‌ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. 
 
చాలాకాలం తర్వాత సీఎం చంద్ర‌బాబుతో ఎన్‌టీఆర్ భేటీ కానుండ‌డం సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరి భేటీ వుంటుంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర పార్ట్-1. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments